లాభాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు


ముంబై : దేశీయ సూచీలు మంగళవారం ట్రేడింగ్లో పాజిటివ్ సంకేతాలతో ఎంట్రీ ఇచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలో 150 పాయింట్లకు పైగా ఎగిసి 28వేల కీలకమార్కును చేధించింది. ప్రస్తుతం207 పాయింట్ల లాభంతో 28110 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ సైతం 63.50 పాయింట్లు ఎగిసి 8,670గా నమోదవుతోంది.  ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా మోటార్స్ సెన్సెక్స్లో లాభాలను నమోదుచేస్తున్నాయి. రియాల్టీ, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్సూమర్ డ్యూరెబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్స్, ఆటో స్టాక్స్, నిఫ్టీ తన కీలకమార్కు 8650 పునరుద్ధరించుకోవడానికి దోహదం చేసినట్టు విశ్లేషకులు చెప్పారు.

 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వీస్తున్న సానుకూల పవనాలతో దేశీయ సూచీలు లాభాలను నమోదుచేస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆసియన్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మారుతీ సుజుకీ షేర్లు గరిష్ట రికార్డులను తాకి రూ.5,045.60గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో టాప్ లూజర్గా భారతీ ఎయిర్టెల్ కొనసాగుతోంది. రిలయన్స్ జియో కమర్షియల్ లాంచింగ్ నేపథ్యంలో టెలికాం స్టాక్స్ ఒత్తిడికి గురవనున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

అటు డాలర్తో రూపాయి మారకం విలువ 0.10 పైసలు బలపడి 67.08గా కొనసాగుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయల నష్టంతో 31,045గా ట్రేడ్ అవుతోంది.

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top