‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’

‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’ - Sakshi


పట్నా: బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ మరో ప్రజాకర్షక హామీని ప్రకటించింది. పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా వాటికి రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని తెలిపింది.


ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ మోదీ వెల్లడించారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తే అవి నడవడానికి పెట్రోలు ఎవరిస్తారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ విమర్శించిన నేపథ్యంలో సుశీల్‌మోదీ ఈ వాగ్దానాన్ని ఇచ్చారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top