బాలికపై అత్యాచారం: సాధువు అరెస్టు
ఇంకా టీనేజి కూడా దాటని 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన కేసులో ఓ సాధువును పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ సమీపంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు చెందిన ఆనంద దాస్ అలియాస్ సంజీవ్ శర్మ ఆ బాలికను ఈనెల 3వ తేదీన కిడ్నాప్ చేశాడు.
అతడి బారి నుంచి బాలికను పోలీసులు ఆదివారం విడిపించారు. అతడిపై సెక్షన్ 363 (కిడ్నాప్), 376 (అత్యాచారం), పోస్కో (లైంగిక నేరాల నుంచి బాలికలకు రక్షణ) చట్టాల కింద కేసులు నమోదు చేశారు. తనను మహారాష్ట్రలోని ఓ గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ చాలా రోజుల పాటు తనపై అత్యాచారం చేశాడని ఆ బాలిక తెలిపింది.