చాపల కోసం రూ. 92 లక్షల ఖర్చు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజ్పథ్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో చాపల కొనుగోలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? అక్షరాలా 92 లక్షల రూపాయలు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు గురువారం తెలిపింది. ఆయుష్ మంత్రిత్వశాఖ మొత్తం 37 వేల యోగా చాపలను కొనుగోలు చేసింది.
మెసర్స్ ఆర్క్ కాన్సెప్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని సరఫరా చేసింది. ఈ మొత్తం చాపలకు రూ. 92.50 లక్షలు (పన్నులు అదనం) ఖర్చయినట్లు ఆయుష్ శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. మొత్తం కార్యక్రమ నిర్వహణకు దాదాపు రూ. 32 కోట్లు ఖర్చయినట్లు ఇంతకుముందు ప్రభుత్వం తెలిపింది.