వారికి కొత్త ఇళ్లు ఇవ్వనున్న రజనీకాంత్‌

వారికి కొత్త ఇళ్లు ఇవ్వనున్న రజనీకాంత్‌ - Sakshi

శ్రీలంకలోని జప్నాలో తమిళ నిర్వాసితుల కోసం నిర్మించిన 150 కొత్త ఇళ్లను సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఏప్రిల్‌ 9న నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో రజనీ 150 కొత్త ఇళ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తారని లైకా ప్రొడక్షన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా రజనీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతారని, మొక్కలు నాటుతారని తెలుస్తోంది. జ్ఞానం ఫౌండేషన్‌ తమిళ నిర్వాసితుల కోసం ఈ ఇళ్లను కట్టించింది.



లైకా గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్ కరన్‌ అల్లిరాజా తల్లి పేరిట ఏర్పాటుచేసిన జ్ఞానం ఫౌండేషన్‌ రూ. 22 కోట్ల ఖర్చుతో ఏడాదిన్నర కాలంలో ఈ ఇళ్లను నిర్మించిందని లైకా ప్రొడక్షన్‌ తన ప్రకటనలో పేర్కొంది. 2009లో అంతర్యుద్ధం అనంతరం శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలల పునఃనిర్మాణం కోసం జ్ఞానం ఫౌండేషన్‌ కృషి చేస్తున్నది. తమిళ నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మించి ఇస్తున్నది. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top