జపాన్లో భూకంపం, 5.7 తీవ్రత
టోక్యో: జపాన్లో దక్షిణ ప్రాంత ద్వీపం ఒకినావలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకినావతో పాటు ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.
ఒకినావ తీరంలో 40 కిలో మీటర్ల సముద్రం లోపల భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఒకినావలో భూకంపం వచ్చిన కొన్ని నిమిషాల తర్వాత జపాన్ ఉత్తరప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.