మంత్రిగారికి పోలీసు పాదసేవ!

మంత్రిగారికి పోలీసు పాదసేవ!


పోలీసులను మంత్రులు తమ సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వైనం ఒకటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంది. ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఒకరు.. తన బూటు లేసులను ఓ పోలీసు కానిస్టేబుల్తో కట్టించుకున్న వ్యవహారం బట్టబయలైంది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేస్తున్న రచ్పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ కెమెరాకు దొరికేశారు.



ముందుగా ఓ విగ్రహానికి దండ వేసేందుకు బూట్లు విప్పిన మంత్రి.. ఆ తర్వాత వాటిని కట్టుకోడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే గార్డు ఆయన వద్దకు వచ్చారు. మంత్రి ఆయనను ఏమాత్రం ఆపకపోగా.. ఎంచక్కా తన కాళ్లిచ్చి, లేసులు కట్టించుకున్నారు. రచ్పాల్ సింగ్ గతంలో ఐపీఎస్ అధికారిగా కూడా పనిచేశారు. ఈ అంశం వెలుగులోకి రావడంతో విపక్షాలు ఒక్కసారిగా మమత సర్కారుపై మండిపడ్డాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top