బంగారంతో పరారైన గుమస్తా.. పట్టుకున్న పోలీసులు
రాజాం(శ్రీకాకుళం): నగల దుకాణం గుమస్తా బంగారంతో పరారై పోలీసులకు పట్టుబడిన ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఇటీవల ఉద్దీన్ అనే వ్యక్తికి చెందిన దుకాణంలో ఓ బెంగాల్ యువకుడు చేరాడు. ఆ దుకాణంలో బంగారానికి మెరుగు పెడుతుంటారు.
బుధవారం రాత్రి యజమాని దుకాణానికి తాళం వేసుకుని, ఇంటికి వెళ్లిపోయాక ఆ యువకుడు 2.30 గంటల సమయంలో మారు తాళంతో దుకాణం తలుపులు తెరిచి లోపల ఉన్న 124 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడు. అనంతరం పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడు గస్తీ పోలీసులకు కంటపడ్డాడు. వారు అతన్ని స్టేషన్కు తరలించి, దుకాణ యజమానికి సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు.