చెరువులో విషప్రయోగం!


మహబూబాబాద్: కొందరు దుండగులు చెరువులో విషప్రయోగం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పురుగుల మందును కలిపారు. దీంతో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల గ్రామ శివారు కొత్తచెరువులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.



గుర్తుతెలియని దుండగులు చెరువులో పురుగుల మందు కలుపడంతో సుమారు రూ. 5 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో చెరువునే నమ్ముకొని జీవిస్తున్న మత్సకార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ దారుణంపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top