ఆ రాష్ట్ర ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!

యూపీ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ! - Sakshi


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం మూడింట రెండొంతుల మెజారిటీతో ఏర్పాటైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అభివృద్ధిని ఉరకలెత్తించాలని సూచించేందుకు ప్రధాని మోదీ ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తాజా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్‌ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ 71 ఎంపీ స్థానాలను యూపీలో గెలుపొందింది.



ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ యూపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. '15 ఏళ్ల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పార్టీ సంకల్పమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, అందులో ఎంపీల పాత్రను గురించే చర్చించేందుకే ప్రధాని మాతో భేటీ అవుతున్నారు' అని ఈ సమావేశానికి ముందు యూపీ బీజేపీ ఎంపీ ఒకరు మీడియాకు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top