అమితాబ్ కు ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ సర్దారా సింగ్ లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వచ్ఛ భారత్ పాల్గొని స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.
మరింత మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్ఫూర్తి కలిగించారని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. మతగురువు, బాబా రామ్ రహీం కూడా మోదీ అభినందించారు. ప్రజలందరూ స్వచ్ఛ భారత్ లో పాల్గొనేలా ప్రేరణ కలిగించారని ప్రశంసించారు.