ప్రజలను విభజిస్తున్నారు
మోదీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు: రాహుల్
సాక్షి, బెంగళూరు: హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ దేశ ప్రజలను విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ నేతలకు అలవాటేనన్నారు. దాద్రీలో ‘గోమాంస’ ఘటనే ఇందుకు ఉదాహరణ అని, అందులో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. కర్ణాటక రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో రాష్ట్రంలో శుక్రవారం మాండ్య ప్రాంతంలోని పణకనహళ్లి, సణబదకొప్పలు గ్రామాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులు మహేష్, లోకేశ్ల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.