ఉద్యోగాలు కావాలా? ఆయన పిలుస్తున్నారు!

ఉద్యోగాలు కావాలా? ఆయన పిలుస్తున్నారు!

న్యూఢిల్లీ : కంపెనీల పునరుద్ధరణతో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం  ఓ అనూహ్య ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగాలు కావాలనుకునే వారికి తాము ఆహ్వానం పలుకుతున్నట్టు పేర్కొంది. ఇటీవలే స్నాప్డీల్ తన ఉద్యోగుల్లో 600 మందిని తీసివేస్తున్నట్టు ప్రకటించగా.. స్టేజిల్లా మొత్తానికే తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ కంపెనీల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. మరోవైపు కంపెనీలు తీసుకునే ఈ నిర్ణయాలపై ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో స్నాప్ డీల్, స్టేజిల్లా ఉద్యోగులకు పేటీఎం ఈ బంపర్ ఆఫర్ను అందించబోతోంది. శుక్రవారం ఉదయం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు.'' హలో ఢిల్లీ, జాతీయ రాజధాని పరిశ్రమలోని టెక్,ప్రొడక్ట్ ఉద్యోగులారా, వ్యాపార పునరుద్ధరణతో చాలా అసంతృప్తితో ఉన్నారా? అయితే పేటీఎం, పేటీఎం మాల్ మీకు వెల్కమ్ చెబుతోంది'' అంటూ ఓ ట్వీట్ చేశారు.

 

ఈ ట్వీట్లో ఎలాంటి కంపెనీ పేరును శర్మ ప్రస్తావించనప్పటికీ, ఇటీవల స్టార్టప్లో ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ ఆఫర్ అందించనున్నట్టు తెలుస్తోంది. పేటీఎం తన ఈ-కామర్స్ వ్యాపారాలను విస్తరిస్తుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. తమ మార్కెట్ప్లేస్, బ్యాంకులో కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నామని, ట్రైన్డ్, డొమైన్ ఎక్స్పర్ట్లకు వెల్​కమ్ చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ స్టార్టప్లో పనిచేసేవారందరూ మంచి వ్యక్తులేనని తాము నమ్ముతున్నట్టు, వారు తమ కల్చర్కు సరిపడతారని అధికార ప్రతినిధి చెప్పారు. లింక్డ్ ఇన్ పోస్టుల ద్వారా కూడా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పేటీఎం ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top