పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. కర్నూలులో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కరువు జిల్లాలను వెంటనే గుర్తించాలని నారాయణ ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్ను డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం లాక్కోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా పవన్ కల్యాణ్ విజ్ఞప్తి వల్లే భూ సేకరణను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.