పవన్ నాకు స్నేహితుడు : ఏపీ మంత్రి

పవన్ నాకు స్నేహితుడు : ఏపీ మంత్రి - Sakshi


తుళ్లూరు : పత్యేకహోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నాల్గవ భవనంలో శనివారం తనశాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సమయోచితంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి వెల్లడించారు.



జనసేన అధినేత, సినీహీరో పవన్‌కల్యాణ్ తనకు మిత్రుడని చెప్పారు. ప్రత్యేకహోదా ఎవరు కోరినా మంచిదేనన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, కలెక్టర్ క్రాంతిలాల్‌దండే, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top