చెన్నైలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
చెన్నై: దుబాయి నుంచి కౌలాలంపూర్కు బయలు దేరిన ఎమిరేట్స్ విమానం శనివారం చెన్నై విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయ్యింది. దుబాయ్ నుంచి కౌలాలంపూర్ కు వెళుతున్న ఈకె -346 విమానంలో దుబాయికి చెందిన 61 ఏళ్ల ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి సమాచారం అందించారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్ చేయాల్సిందిగా కంట్రోల్ రూమ్ కు ఆదేశాలు పంపారు. ఈమేరకు అధికారుల అనుమతితో విమానాన్ని చెన్నై విమానశ్రయంలో దింపివేశారు. బాధితుడికి తొలుత ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత విమానం కౌలాలంపూర్కు బయలుదేరింది.