మరోసారి కాల్పులకు తెగబడ్డ పాక్


జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్లోని భారత అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఆర్ ఎస్ పురా సెక్టర్ ప్రాంతంలో కాట్రంకా సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.


పాక్ కాల్పులపై వెంటనే స్పందించిన బీఎస్ఎఫ్ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. శనివారం అర్థరాత్రి 1.00 గం.కు మొదలైన ఈ కాల్పులు 2.30 గం.ల వరకు జరుగుతునే ఉన్నాయని తెలిపారు. అయితే భారత్ వైపున ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణం నష్టం కానీ జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top