ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు

ఏపీలో భారీ 'భూ' బ్యాంక్ : చంద్రబాబు


చైనా: చైనా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెంగ్డూలో చైనా పారిశ్రామికవేత్తలతో గురువారం సమావేశమైయ్యారు. ఈ సమావేశానికి చంద్రబాబు బృందంతో పాటు పలవురు చైనా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భారీ ల్యాండ్ బ్యాంక్ ఉందని, దాంతో భూ కేటాయింపులకు ఎలాంటి సమస్య ఉండదన్నారు.



అదేవిధంగా తాము పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తామనీ, ప్రజల నుంచి పూర్తి సహకారం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 12న చంద్రబాబు బృందం చైనా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top