వోలటైల్గా స్టాక్మార్కెట్లు: టీసీఎస్ డీలా
ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభయ్యాయి. అంతర్జాతీయ పరిణామల నేపథ్యంలో సెన్సెక్స్ స్వల్ప నష్టాలమధ్య ఊగిసలాడుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 31 పాయింట్ల నష్టంతో 29,288 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 9,093వద్ద కొనసాగుతున్నాయి. దీంతో కీలకమైన మద్దతు స్థాయి 9100 కిందికి దిగజారింది. ముఖ్యంగా మెటల్, బ్యాంకింగ్ రంగాలు బలహీనంగా మొదలయ్యాయి. ప్రధానంగా ఇటీవల బాగా బలపడిన ఇండియాబుల్స్ టాప్ లూజర్గా వింది. ఐడీబీఐ బ్యాంక్, హిందాల్కో, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో నష్టపోతున్నాయి. అటు మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత ఫలితాలను ప్రకటించిన టీసీఎస్ నష్టాలతో ట్రేడ్ అవుతోంది. మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా బలహీనంగా ఉంది. కాగా బీఈఎల్, ఆర్ఐఎల్ ఐషర్ మోటార్స్, ఎస్బ్యాంక్, హీరో మెటార్ కార్ప్ స్వల్ప లాభాలతో ఉన్నాయి.
అటు డాలర్మారకంలో రూపాయి 0.03 పైసలనష్టంతో 64.55 వద్ద ఉంది.