రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!

రిషితేశ్వరి కేసులో కొత్తకోణం! - Sakshi


గుంటూరు:  నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.



కాగా రిషితేశ్వరితో పాటు మిగిలిన విద్యార్థులు మంగళగిరిలో సినిమా చూడలేదని, విజయవాడలోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్లో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాత్రి 11 గంటలకు రిషితేశ్వరితో పాటు మిగతా విద్యార్థులు హాస్టల్కు చేరుకున్నారని, అనంతరం ఆమె భోజనం చేసి పడుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్తో పాటు హాస్టల్లో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top