కాశ్మీర్ లో దీపావళి జరుపుకోనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి పర్వదినాన్ని జమ్మూ కాశ్మీర్ లో జరుపుకోవాలని నిర్ణయించారు. వరద బాధితులతో కలిసి ఆయన పండగ చేసుకోనున్నారు.
సెస్టెంబర్ లో సంభవించిన వరదల కారణంగా జమ్మూకాశ్మీర్ అతలాకుతలమైంది. బాధితులకు అండగా ఉండేందుకు ప్రధాని మోదీ దీపావళి పండుగను కాశ్మీర్ లో జరుపుకోవాలని నిర్ణయించారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నారు. ప్రధాని నిర్ణయంపై కాశ్మీర్ వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.