మోదీ సర్కారు వెనుకంజ!
న్యూఢిల్లీ:వివిధ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం లోక్సభలో ఆందోళన కొనసాగించిన ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. లోక్ సభలో సస్పెన్షన్ల వ్యవహారంలో వెనక్కు తగ్గేందుకు నరేంద్ర మోదీ సర్కారు సన్నద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
విపక్షాలన్ని ఏకం కావడంతో ఎన్డీఏ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలోనే లోక్ సభలో 25 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేసి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మరక పడకముందే వెనక్కు తగ్గాలని వ్యూహంలో ఉన్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ ల చెడ్డపేరు తెచ్చుకునేకంటే.. సభలోనే తేల్చుకుందామని ఎన్డీఏ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.