పోలీసుస్టేషన్ లో మోదీ ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన విలక్షణత చాటుకున్నారు. ఆకస్మికంగా పోలీసుస్టేషన్ ను తనిఖీ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఢిల్లీలోని వాల్మీకి బస్తీలో గురువారం ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వెళుతూ మార్గమధ్యలోని మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేశారు.
పోలీసు స్టేషన్ ఎంత పరిశుభ్రంగా ఉందో పరిశీలించారు. ఆకస్మాత్తుగా తన కాన్వాయ్ ను ఆపేసి పోలీసు స్టేషన్ లోకి వెళ్లారు. కొద్దినిమిషాల పాటు అక్కడ గడిపిన మోదీ.. స్టేషన్ లో పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీరారు. స్వయంగా ప్రధాని ఆకస్మిక తనిఖీకి రావడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సంబంధిత వార్తలు