కెనడాలో దాడిని ఖండించిన మోదీ
న్యూఢిల్లీ: కెనడా పార్లమెంట్ పై దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. తీవ్రవాదంపై పోరుకు కెనడాకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీయిచ్చారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
'కెనడా పార్లమెంట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. పార్లమెంట్ ను ప్రజాస్వామ్య ఆలయంగా భావిస్తాం. అలాంటి పార్లమెంట్ పై దాడి జరిగితే ఆ దేశపు ఆందోళనను నేను అర్థం చేసుకోగలను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారతీయుల తరపున సంతాపం ప్రకటిస్తున్నా' అని మోదీ పేర్కొన్నారు.