ఆ రీమేక్లో చైతూ-సమంత జోడీ!
ప్రముఖ రచయిత చేతన్ భగత్ నవల ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన సినిమా 'టు స్టేట్స్'. అక్కడ విజయవంతమైన ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్లో ఎవరు నటిస్తారనే దానిపై అప్పుడే ఆసక్తి నెలకొంది.
త్వరలో ఒక ఇంటివారు కాబోతున్న టాలీవుడ్ ప్రేమజంట అక్కినేని నాగా చైతన్య, సమంత ఈ సినిమా తెలుగు రీమేక్లో నటించబోతున్నారని కథనాలు వస్తున్నాయి. తాము ప్రేమించుకుంటున్న విషయాన్ని ఇటీవలే చైతూ-సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరి పెళ్లి జరగవచ్చునని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైతూ, సమంత మరోసారి జత కట్టబోతున్నారనే వార్త హాట్ టాపిక్గా మారింది. 'ఏ మాయ చేసావే' సినిమాతో తొలిసారి కలిసి నటించిన ఈ జోడీ.. ఆ తర్వాత 'ఆటోనగర్ సూర్య', 'మనం' తదితర చిత్రాలతో అలరించారు.
దర్శకుడు వీవీ వినాయక్ పర్యవేక్షణలో 'టు స్టేట్స్' తెలుగులో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, సాజిద్ నడియాడ్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించాయి. వీవీ వినాయక్ దగ్గర పలు చిత్రాలకు కో డైరెక్టర్గా వ్యవహరించిన వెంకట్ కుంచెమ్.. వినాయక్ సహకారంతో ఈ చిత్రం రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. ఆయన ఈ సినిమా విషయాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ దృష్టికి తీసుకెళ్లడంతో.. దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది.
సంబంధిత వార్తలు