జయకు మద్దతుగా ఎంపీల నిరాహారదీక్ష
న్యూఢిల్లీ: 'అమ్మ'కు మద్దతుగా అన్నాడీఎంకే ఎంపీలు నిరహారదీక్ష చేపట్టారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట అన్నాడీఎంకే ఎంపీలు గురువారం దీక్షకు దిగారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు దీక్ష కొనసాగించనున్నామని అన్నాడీఎంకే పార్లమెంటరీ నాయకుడు పి. వేణుగోపాల్ తెలిపారు. జయలలిత బెయిల్ పిటిషన్ పై విచారణలో జాప్యంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చట్టప్రకారం వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.