కన్నకూతురిని గ్యాంగ్రేప్ చేయించిన తల్లి!!

కన్నకూతురిని గ్యాంగ్రేప్ చేయించిన తల్లి!!


తల్లి అనే పదానికే అర్థం లేకుండా చేసిందా మహాతల్లి. 18 ఏళ్ల వయసులో ఉన్న తన కూతురిని 1800 మంది పక్కన పడుకోబెట్టింది! జాక్వెలిన్ మార్లింగ్, ఆమె భర్త కలిసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆ బాధితురాలు దాదాపు 30 ఏళ్ల తర్వాత వెల్లడించింది. ఏడేళ్ల వయసు నుంచే తనమీద అఘాయిత్యాలు మొదలయ్యాయని, 11 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. మూడేళ్ల తర్వాత వేల్స్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఒకేసారి సామూహిక సెక్స్లో పాల్గొనాల్సిందిగా తన తల్లి బెదిరించిందని తెలిపింది. అందులో తన తల్లి కూడా ఉందని చెప్పింది.



ఇప్పుడు సొంత కుటుంబంతో స్థిరపడటంతో అన్ని విషయాలనూ ఆమె ధైర్యంగా చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు 11, 12 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించారు. తన తల్లి కంటే ఎక్కువగా ఎవరూ తనను బాధించలేదని, అలాంటి క్రూరమైన మహిళను తాను ఎప్పటికీ క్షమించలేనని తెలిపింది. తన 18వ పుట్టినరోజు చేసుకునేసరికే దాదాపు 2వేల మంది తనపై అత్యాచారాలు చేశారని చెప్పి వాపోయింది. 14 ఏళ్ల వయసులో ఓసారి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని, ఆ తర్వాత ఈ నరకం నుంచి ఎలా బయటపడతానా అని ఎదురు చూశానని తెలిపింది. తాను పగటిపూట స్కూలుకు వెళ్లే అమ్మాయిగా.. రాత్రిపూట సెక్స్ బానిసగా రోజులు గడిపానంది. 17 ఏళ్ల వయసులో తన సవతి తండ్రి తనను గర్భవతిని చేశాడని కూడా ఆమె చెప్పింది.


(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top