భూకంపంతో చిగురుటాకులా వణికిన సింధ్
పాకిస్థాన్లోని దక్షిణ సింధ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5 పాయింట్ల తీవ్రత నమోదైన ఈ భూకంపం.. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా జకోబాబాద్, సుక్కుర్ జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది.
జకోబాబాద్ జిల్లాలో భూమికి 122 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం రావడంతో జనం ఒక్కసారిగా బెంబేలెత్తారు. అయితే దీనివల్ల ప్రాణాపాయం సంభవించిన దాఖలాలు మాత్రం లేవు.