ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ అరెస్టు
రామచంద్రాపురం(రాజమండ్రి): తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్థానిక బస్ డిపో వద్ద ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకే ధర్నా చేపట్టారు.
దీంతో బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా కొందరు వైస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.