మార్చి 17న ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
- హైదరాబాద్ స్థానానికి, ఏపీలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: రాష్ట్రంలోని హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. మార్చి 17న ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ స్థానంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ హాసన్ జాఫ్రీ పదవీకాలం మే 1వ తేదీన ముగియనుంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈఎన్నికల కోసం ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ డైరెక్టర్ ధీరేంద్ర ఓఝా ఎన్నికల షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల నిబంధనావళి తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్
-
ఈ నెల 21న ఎన్నికల నోటిఫికేషన్ -
21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ -
మార్చి 1న నామినేషన్ల పరిశీలన -
3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు -
17న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ -
20న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
రెండో రోజూ ఎమ్మెల్సీ నామినేషన్లు నిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగా రెడ్డి, మహబూ బ్నగర్ ఉపాధ్యాయ శాసన మండలి స్థానానికి నామినేషన్ల రెండో రోజు మంగళవారం కూడా ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అద్వైత్ కుమార్సింగ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఈ ఎన్నికల నామినేషన్లను జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాల యంలో స్వీకరించడానికి ఏర్పాట్లు చేశారు.