పాడేరులో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అరెస్ట్
పాడేరు: విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, పలువురు మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పట్టణంలో శనివారం ప్రశాంతంగా బంద్ జరుగుతోంది.
పార్టీ శ్రేణులు బస్సులను బయటకు పోనీయకుండా డిపో వద్ద బైఠాయించారు. శాంతియుతంగా చేస్తున్నప్పటికీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి, డిపో నుంచి బస్సులను బయటకు పంపారు.