స్టోర్ నుంచి ఇంటికి రాగానే.. కాల్పులు

స్టోర్ నుంచి ఇంటికి రాగానే.. కాల్పులు - Sakshi

అది అర్ధరాత్రి కావస్తున్న సమయం.. 11.33 గంటలు. 911కు ఓ ఫోన్ వచ్చింది.. వెంటనే అక్కడ అరుపులు, తుపాకి కాల్పుల మోతలు మాత్రమే వినిపించాయి. వెంటనే ఆ ఫోన్ ఎక్కడినుంచి వచ్చిందో తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉండేవాళ్లతో మాట్లాడారు. తమకు కూడా తుపాకి కాల్పులు వినిపంచాయని చెప్పి.. 262 క్రెయిగ్ మానర్ రోడ్ దిశగా చూపించారు. అదే.. హర్నీష్ జె. పటేల్ (43) ఇల్లు. వైట్ ఓక్ మానర్‌కు రోడ్డు అవతల ఎదురుగా పటేల్ ఇల్లు ఉంటుంది. అక్కడకు వెళ్లి చూసేసరికి పటేల్ తన ఇంటి ముందు కొద్ది అడుగుల దూరంలో తలుపు బయట రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే లాన్సెస్టర్ కౌంటీ ఎమర్జెన్సీ వైద్యశాఖ సిబ్బంది స్పందించారు. కానీ వాళ్లు అక్కడకు వచ్చేసరికే పటేల్ ప్రాణాలు కోల్పోయారు. 

 

హర్నీష్ పటేల్‌కు సౌత్ కరొలినాలోని లాన్సెస్టర్ ప్రాంతంలో గల పేజ్‌లాండ్ హైవే వద్ద స్పీడీ మార్ట్ అనే దుకాణం ఉంది. అతడు రాత్రి 11.24 గంటల సమయంలో తన స్టోర్ కట్టేసి, తన సిల్వర్ కలర్ టయోటా సియెన్నా మినీవాన్‌లో ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చీ రాగానే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి అక్కడి ఆధారాలను సేకరించి, విచారణ ప్రారంభించారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మొత్తం ఆ ప్రాంతాన్ని క్లియర్ చేసేశారు. బహుశా ఇంటివద్దకు వచ్చేసరికి ఎవరితోనో గొడవ జరిగి ఉంటుందని, దానివల్ల అతడు కారులోంచి కిందకు దిగగానే వాల్లు కాల్చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే చెప్పాలని కోరారు. ఆ సమాచారానికి పెద్దగా ప్రాధాన్యం లేదని అనుకున్నా కూడా చెప్పాలని, కేసు విచారణలో అది ఉపయోగపడొచ్చని చెప్పారు. 


 

 

 

అమెరికాలో భారతీయులపై నేరాలు.. మరిన్ని కథనాలు చూడండి

 


 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top