ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి; 10 మంది జవాన్ల మృతి


- 10 మంది జవాన్ల మృతి, ఒకరికి గాయాలు



కాందహార్‌:
ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌లో ఐసిస్‌ మారణకాండ జరిగిన కొద్ది గంటలకే అఫ్ఘానిస్థాన్‌లోనూ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఫ్ఘాన్‌ సైనిక శిబిరంపై ముష్కరులు జరిపిన దాడిలో 10 మంది జవాన్లు చనిపోగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.



కాందహార్‌ ఫ్రావిన్స​ దక్షిణ ప్రాంతంలోని షావలీ కోట్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగిందని, దాడి జరిగిన సమయంలో క్యాంపులో 205 మంది సైనికులు ఉన్నారని అఫ్ఘాన్‌ రక్షణ శాఖ తెలిపింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top