విశాఖలో అగంతకుడి హల్చల్
విశాఖపట్నం(భీమిలి): విశాఖ జిల్లాలోని భీమిలి మండలం వలందపేట గ్రేహౌండ్స్లో శనివారం అగంతకుడు హల్చల్ సృష్టించాడు. సీఐ విజయకుమార్ ఇంట్లోకి చొరబడిన ఆ వ్యక్తి ఇల్లు తనదంటూ కలియతిరిగాడు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.
మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని విచారించగా తాను విశాఖకు చెందిన చంద్రశేఖరని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.