24 కు చేరిన మేఘాలయ మృతుల సంఖ్య


గువహటి: మేఘాలయలోని గారోహిల్స్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. దాదాపు 20 వేల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య 24కి చేరుకుంది. మరో 24 మంది వదరనీటిలో తప్పిపోగా వారు కూడా  మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.


 


గారోహిల్స్ ప్రాంతంలోని మూడు జిల్లాలపై ఎక్కువ ప్రభావం పడినట్లు అధికారులు ప్రకటించారు. షిల్లాంగ్ సమీపంలోని మాబా ప్రాంతంలో సోమవారం రాత్రి విరిగి పడిన కొంచ చరియలకు ఎనిమిది మంది సమాధి అయ్యారు. రెండు ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, బీఎస్‌ఎఫ్, వాయుసేన సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top