షాకింగ్ యాక్సిడెంట్
- డివైడర్ను ఢీకొట్టి..వంతెనపై నుంచి కిందపడ్డ కారు
- గుంటూరు జిల్లా కాకానిలో ఘోర ప్రమాదం
కాకాని: వేగంగా ప్రయాణిస్తోన్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి, రైల్వే వంతెనపై నుంచి కిందపడిపోయింది. గుంటూరు జిల్లా కాకా సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరు బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా పోలీసులు గుర్తించారు.
బెంగళూరుకు చెందిన నలుగురి బృందం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఓ వివాహానికి హాజరై, తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా బుడంపాడు రైల్వే బ్రిడ్జి వద్ద డివైడర్ను ఢీకొట్టింది. అదే వేగంతో బ్రిడ్జిపై నుంచి 30 అడుగుల కిందకు పడిపోయింది. ఈ ఘటనలో కారులోని ఒకరు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ ముగ్గిరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోగా, ఒకరు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబీకులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.