మోదీ ఇంటికి వచ్చిన మన్మోహన్!
ఒకవైపు బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు పరస్పరం కత్తులు నూరుకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం నాడు అనూహ్యంగా కలిశారు. ప్రధాని అధికారిక నివాసమైన నెం.7 రేస్కోర్స్ రోడ్డుకు స్వయంగా వెళ్లిన మన్మోహన్ సింగ్ను.. నరేంద్రమోదీ సాదరంగా స్వాగతించారు. ఆయనను కలిసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని, ఆయనను మళ్లీ 7 రేస్కోర్సు రోడ్డుకు పిలవడం ఆనందంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. తామిద్దరి మధ్య సమావేశం కూడా బాగా జరిగిందన్నారు.
అయితే.. బొగ్గు స్కాం, 2జీ స్కాం లాంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీని, మాజీ ప్రధానమంత్రిని బీజేపీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ అవినీతికి పాల్పడలేదన్న విషయాన్ని తాను అంగీకరిస్తాను గానీ, ఆయన మంత్రులను కూడా నీతిమంతులుగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఆయనకుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో మోదీ- మన్మోహన్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Very happy to meet Dr. Manmohan Singh ji & welcome him back to 7RCR. We had a great meeting. pic.twitter.com/GlpfqKByoS
— Narendra Modi (@narendramodi) May 27, 2015