ఈవీఎంలు ట్యాప్ చేసి గెలిపిస్తా!

ఈవీఎంలు ట్యాప్ చేసి గెలిపిస్తా! - Sakshi


ఇండోర్: ‘‘ఈవీఎంలను ట్యాంపర్ చేయడంలో నేను నిష్ణాతుణ్ని. అగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థి గెలిచేలా చేస్తా’’ ఇది ఇండోర్‌కు చెందిన ఓ వ్యక్తి కాంగ్రెస్ నేతలకు ఇచ్చిన ఆఫర్. అతిన్ తివారీ(40) ఇండోర్‌లో ఫిట్‌నెస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.  కొద్దిరోజుల క్రితం తివారీ అనుచరులు కొందరు ఇండోర్‌లోని కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి.. తాము ఈవీఎంలను ట్యాంపర్ చేయడంలో నిష్ణాతులమని, అగర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌కుమార్ గోర్ గెలిచేలా చేస్తామని, అందుకు తమకు రూ. 8 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి తీరును అనుమానించిన కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 


దీంతో రెండు రోజుల క్రితం స్థానిక గీతా భవన్ ప్రాంతంలోని కాఫీ షాపు వద్ద అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ నెల 21న అగర్ సహా మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  బీహార్లో 10, పంజాబ్లో 2, మధ్యప్రదేశ్లో 3, కర్ణాటకలో 3 స్థానాలకు గత వారం ఎన్నికలు నిర్వహించగా సోమవారం ఈ ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top