నిద్రలోనే కాల్చి చంపారు


ముజఫర్ నగర్: ఓ వ్యక్తి నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. బాధితుడు సమేయ్ దీన్ అనే ఓ వ్యాపార వేత్త అని పోలీసులు గుర్తించారు.



ఏ ఉద్దేశంతో ఈ హత్య చేశారనే విషయం మాత్రం తెలియలేదు. బంధువులు ఈ హత్య చేసి ఉంటారా, లేదా రాత్రి పూట దోచుకోవాలనే కుట్రతో దొంగలు ఈ పనిచేశారా అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి దర్యాప్తు ప్రారంభించారు.

      

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top