భోజనానికి ఆగి.. బలైపోయాడు


తడ(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ - శ్రీకాళహస్తి మార్గంలో బుధవారం రాత్రి లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని చెన్నైకు చెందిన సుందరమ్‌గా గుర్తించారు. సుందరమ్ తిరుమలకు వెళ్లి బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాడు. బుధవారం రాత్రి భోజనం కోసం బస్సును తడ సమీపంలో రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ దగ్గర ఆపారు. దీంతో సుందరమ్ బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ లారీ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top