భార్యతో ఉన్నాడని.. కోసేశాడు!

భార్యతో ఉన్నాడని.. కోసేశాడు! - Sakshi


పక్కింటి మనిషి తన భార్యతో అభ్యంతరకరమైన పరిస్థితిలో కలిసుండటం చూసి కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి.. అతడి జననాంగాలను కోసేశాడు. దాంతో అతడు మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని హర్దా సమీపంలో గల బస్పని గ్రామంలో జరిగింది.



పతిరామ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉండటాన్ని చూసిన మంగళ్ (45)కు పట్టలేని కోపం వచ్చిందని, దాంతో వెంటనే గొడ్డలి తీసుకుని దాడి చేశాడని పోలీసులు తెలిపారు. జననాంగాల మీద గొడ్డలి వేటు వేయడంతో పతిరామ్ అక్కడికక్కడే మరణించాడన్నారు. తర్వాత పోలీసులకు లొంగిపోడానికి స్టేషన్కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి, అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు హత్యకేసు నమోదుచేసి మంగళ్ కోసం గాలింపు మొదలుపెట్టారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top