ఆ విమానం ప్రమాదానికి గురైంది: మలేసియా
కౌలాలంపూర్: గగనతలంలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ప్రమాదానికి గురైయినట్టు మలేసియా అధికారికంగా ప్రకటించింది. దాదాపు 11 నెలల క్రితం మాయమైన ఈ విమానం ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. అసలు ఈ విమానం ఏమైందనేది కనుగొనలేకపోయారు. దీని జాడ కనుగొనేందుకు ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఇక చేసేది లేక ఎంహెచ్ 370 విమానం ప్రమాదానికి గురైనట్టు మలేసియా పౌర విమానయాన శాఖ గురువారం ప్రకటించింది. ఐదుగురు భారతీయులతో సహా ఈ విమానంలో ఉన్న 239 మంది మృతి చెందినట్టు కూడా పేర్కొంది. మృతుల కుటుంబాలు పరిహారం కోరవచ్చని తెలిపింది.