16మంది తమిళ జాలర్లు అరెస్టు
రామేశ్వరం: నదీ జలాల విషయంలో మరోసారి శ్రీలంకతో వివాదం నెలకొంది. శ్రీలంక నావికా దళం పదహారుమంది తమిళనాడు జాలర్లను అరెస్టు చేశారు. అంతర్జాతీయ తీర ప్రాంత రేఖను వారు దాటి తమ నదీ జలాల్లోకి వచ్చారని నావికా దళ అధికారులు తెలిపారు.
కానీ, తమిళ జాలర్లు కోడియాకరై అనే తీర ప్రాంతంలోనే మత్య వేటకు వెళ్లారు తప్ప శ్రీలంక నదీ జలాల్లోకి ప్రవేశించలేదని, అక్రమంగా తమవారిని లంక సైన్యం అరెస్టు చేసిందని మత్యకారుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎమిరేట్ తెలిపారు. ఇదిలాఉండగా, అరెస్టు చేసిన తమిళ జాలర్లను, వారి బోటులను శ్రీలంకలోని జఫ్నా జిల్లాలోగల కాంగెన్ సంతురాయ్ వద్దకు తీసుకెళ్లారు. మరోపక్క, వీరితోపాటు బయలుదేరిన సెల్వరాజు అనే ఓ మత్యకారుడు చేపలుపట్టే క్రమంలో సముద్రం మద్యలో చనిపోయినట్లు తెలిసింది.