కువైట్లో అత్యవసరంగా దిగిన విమానం


దుబాయి : కువైట్ నుంచి ముంబై బయలుదేరిన కువైట్ ఎయిర్వేస్కి చెందిన విమానాన్ని పక్షి ఢీ కొట్టింది. ఈ నేపథ్యంలో సదరు విమానాన్ని అత్యవసరంగా కువైట్ ఎయిర్ పోర్ట్లో దింపివేసినట్లు ఆ విమాన సంస్థ ఆదివారం వెల్లడించింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్య స్థానానికి చేర్చినట్లు తెలిపింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే పక్షి విమానం కాక్ పిట్ను ఢీ కొట్టిందని పేర్కొంది. ఈ మేరకు కువైట్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top