జీఎస్‌టీ బూస్ట్‌: డబుల్‌ సెంచరీ


ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  సోమవారం ఉత్సాహంగా ప్రారంభ మయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో  ఈ వారం బోణీ కొట్టాయి.  సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 30,667 వద్ద  నిఫ్టీ 48 పాయింట్లు ఎగసి 9,476 వద్ద కొనసాగుతున్నాయి.  ఒక్క ఐటీ మినహా, దాదాపు అన్ని రంగాలూ  పాజిటివ్‌గా ఉన్నాయి. ప్రధానంగా జీఎస్‌టీ  బూస్ట్‌తో  ఎఫ్‌ఎంసీజీ   సెక్టార్‌ టాప్‌ విన్నర్‌గా ఉంది. అలాగే రియల్టీ, మెటల్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగాలు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీసీ,  ఐబీహౌసింగ్‌, భారతీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, టాటా మోటార్స్‌, హిందాల్కో, యస్‌బ్యాంక్‌ లాభాల్లో, బీపీసీఎల్‌, టాటా పవర్‌, సన్‌ ఫార్మా, విప్రో  స్వల్పంగా నష్టపోతున్నాయి.

అటు డాలర్‌ మారకంలో రూపాయి కూడా పాజిటివ్‌గానే  ప్రారంభమైంది.  0.40 పైసల లాభతో రూ. 64.44వ వద్ద వుంది.  ఎంసీఎక్స్‌  మార్కెట్‌లో పుత్తడి పదిగ్రా. 55 క్షీణించి రూ.28,648 వద్ద ఉంది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top