నిలకడగా కంచి పీఠాధిపతి ఆరోగ్యం
అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. జయేంద్ర సరస్వత్రిని ఐసీయూ నుంచి మెడికల్ వార్డకు తరలించినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు తెలిపారు. జయేంద్ర సరస్వతి షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చాయన్నారు. గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వివరించారు.