స్టాలిన్పై జయలలిత పరువునష్టం దావా

స్టాలిన్పై జయలలిత పరువునష్టం దావా


డీఎంకే కోశాధికారి, రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంకే స్టాలిన్పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. అసెంబ్లీ బయట తనకు, అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమె ఈ కేసు పెట్టారు. ముఖ్యమంత్రి తరఫున చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ ఈ కేసు దాఖలు చేశారు.



స్టాలిన్ సహా కొంతమంది డీఎంకే ఎమ్మెల్యేలను ఈనెల 22న అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. ఈ సందర్భంగా అసెంబ్లీ బయట విలేకరులతో మాట్లాడుతూ స్టాలిన్, మరికొందరు డీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి, స్పీకర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ప్రాసిక్యూటర్ జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top