లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని

లీ క్యుయాన్ యో అంత్యక్రియలకు జపాన్ ప్రధాని - Sakshi


టోక్యో: జపాన్ ప్రధాని షింజోఅబే మార్చి 29 వ తేదీన సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన సింగపూర్ మాజీ ప్రధానమంత్రి లీ క్యుయాన్ యో(91)  అంత్యక్రియల్లో పాల్గొననున్నారని జపాన్ కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడే ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు స్థానిక నాయకులూ పాల్గొననున్నారు. లీ క్యుయాన్ యో మార్చి 23 వ తేదీ మరణించారు. ఆయన 1965-1990 మధ్య కాలంలో సింగపూర్ ప్రధానిగా సేవలందించారు. అనంతరం ఆయన సీనియర్ మంత్రిగా, మంత్రి వర్గ సలహాదారుగా దేశానికి సేవలందించారు. 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top