ప్రధాని మోదీతో ‘ఆలీబాబా’ జాక్ మా భేటీ
న్యూఢిల్లీ: భారత్లో కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టిన ైచె నా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా చైర్మన్ జాక్ మా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. చిన్న తరహా సంస్థలకు తోడ్పాటు అందించే అంశంపై ఈ సందర్భంగా చర్చించినట్లు ఆలీబాబా గ్రూప్.. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్వీటర్లో పేర్కొంది. ఇప్పటికే పలు భారతీయ సంస్థలు ఆలీబాబా పోర్టల్ ద్వారా విక్రయాలు జరుపుతున్నాయి. నాలుగు నెలల్లో జాక్ భారత్ సందర్శించడం ఇది రెండోసారి. నవంబర్లో వచ్చినప్పుడు ప్రధానితో ఆయన భేటీ కుదరలేదు.