విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు

విమాన ప్రమాదంలో 141కి పెరిగిన మృతులు


జకార్తా: ఇండోనేషియా మెడాన్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య బుధవారానికి 141కి చేరింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన రవాణ విమానం హెర్క్యూలస్ -3 మంగళవారం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే.. మెడాన్ నగరంలోని నివాస ప్రాంతాలపై కుప్పకూలింది.


ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులతోపాటు సిబ్బంది 113 మంది మరణించారు. అయితే ఈ విమానం నివాస భవనాలపై పడటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.   

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top